Homeజిల్లాలుకామారెడ్డిJubilee Hills by election | షేక్​పేట్ డివిజన్ ఇన్​ఛార్జీగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల...

Jubilee Hills by election | షేక్​పేట్ డివిజన్ ఇన్​ఛార్జీగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

జూబ్లిహిల్స్​ ఉప ఎన్నిక నేపథ్యంలో షేక్​పేట్​ డివిజన్​ బీఆర్​ఎస్​ పార్టీ ఇన్​ఛార్జిగా జాజాల సురేందర్​ను నియమితులయ్యారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jubilee Hills by election | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగనున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్​ఎస్ పార్టీ (BRS)​ పలువురు సీనియర్​ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) నాయకత్వంలో షేక్​ పేట్​ డివిజన్​ ఇన్​ఛార్జీగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ను (Former MLA Jajala Surender) నియమించారు.

ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే జాజాల మాట్లాడుతూ.. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నా మీద నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీ షేక్​ పేట (Sheikh Pet) ఇన్​ఛార్జి బాధ్యతలు అప్పగించిందన్నారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు.