అక్షరటుడే, ఇందూరు: MP arvind | ఎంపీ అర్వింద్ (MP Dharmapuri Arvind) సమక్షంలో నిజామాబాద్ మాజీ కార్పొరేటర్ బీజేపీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ హైదరాబాద్లో ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ అర్వింద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) దేశాభివృద్ధికి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరుతున్నట్లు సురేష్ తెలిపారు.
MP arvind | హామీలు నెరవేరాయి..
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారు. అనంతరం పంచరెడ్డి సురేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షక పథకాలు, అలాగే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడైన బీజేపీలో చేరానన్నారు. సంక్రాంతి తరువాత నా అనుచరులు పార్టీలో చేరతారని చెప్పారు.
