HomeతెలంగాణNagarjuna Sagar | నాగార్జున సాగర్​కు తగ్గిన వరద

Nagarjuna Sagar | నాగార్జున సాగర్​కు తగ్గిన వరద

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nagarjuna Sagar | ఎగువన వర్షాలు తగ్గడంతో కృష్ణమ్మ (Krishna River) శాంతించింది. దీంతో నాగార్జున సాగర్​కు వరద తగ్గుముఖం పట్టించింది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో కొన్ని రోజులుగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. అయితే వర్షాలు తగ్గడంతో ప్రవాహం తగ్గింది. దీంతో నదిపై గల జూరాల, సుంకేసుల గేట్లను అధికారులు మూసి వేశారు.

Nagarjuna Sagar | శ్రీశైలం ప్రాజెక్ట్​కు 57,851 క్యూసెక్కుల ఇన్​ఫ్లో

ఎగువన ప్రాజెక్ట్​ గేట్లు మూసి వేయడంతో శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) వరద తగ్గింది. జూరాలలో విద్యుత్​ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 57,851 ఇన్​ఫ్లో వస్తోంది. జలాశయానికి ఇన్​ఫ్లో తగ్గడంతో అధికారులు క్రస్ట్​ గేట్లను మూసివేశారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)​ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్​లోకి 66,745 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 227.29 టీఎంసీల నీరు ఉంది.

Nagarjuna Sagar | ఆ ప్రాజెక్ట్​లు వెలవెల

కృష్ణానదిపై గల ప్రాజెక్ట్​లు జలకళను సంతరించుకోగా.. గోదావరి, మంజీర నదులపై గల జలాశయాలు వెలవెలబోతున్నాయి. దిగువన కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతున్న ఎగువన ప్రవాహం లేక బోసిపోయింది. దీంతో తెలంగాణ(Telangana)లో సాగు నీటికి కీలకమైన శ్రీరామ్​ సాగర్​, ఎల్లంపల్లి, మిడ్​ మానేర్​, లోయర్​ మానేరు ప్రాజెక్ట్​లు, సింగూరు, నిజాం సాగర్​ డ్యామ్​లు ఇన్​ఫ్లో లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్ట్​ల కింద ఆయకట్టు ఉన్న రైతులు(Farmers) ఆందోళన చెందుతున్నారు.