అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు (Sriram Sagar Project) ఎగువ నుంచి వరద పెరిగింది. దీంతో అధికారులు శుక్రవారం ఉదయం నాలుగు వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు. జలాశయంలోకి ప్రస్తుతం 22,154 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
నాలుగు వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, ఔట్ఫ్లో సమానంగా ఉండడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేస్థాయిలో నీరు నిల్వ ఉంది.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
గోదావరిలోకి (Godavari) నీటి విడుదలను ప్రారంభించడంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు, పశువుల కాపరులు నదిలోకి వెళ్లొద్దన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వరద పెరిగితే నీటి విడుదలను పెంచుతామని తెలిపారు.
