అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి: Irrigation projects | ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు వరద తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతోంది.
ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు (Sriram Sagar Project) వరద వస్తోంది. భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో అధికారులు 16 గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 56,513 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 39 వరద గేట్ల ద్వారా 56,513 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేలు, సరస్వతి కాలువకు 650 క్యూసెక్కులు వదులుతున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. కాకతీయ కాలువకు (Kakatiya Canal), లక్ష్మి కాలువకు నీటివిడుదలను నిలిపేశారు.
Sriram Sagar | నిలకడగా నీటిమట్టం..
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1091.00 అడుగుల (80.501 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గోదావరిలోకి (Godavari) నీటి విడుదల కొనసాగుతుండడంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Sriram Sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్కు..
నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 33,910 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1404.62 అడుగుల (17.4 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
