Homeఅంతర్జాతీయంFlight Tickets | రూ.1,200కే ఫ్లైట్​ టికెట్.. ఎయిరిండియా బంపర్​ ఆఫర్​

Flight Tickets | రూ.1,200కే ఫ్లైట్​ టికెట్.. ఎయిరిండియా బంపర్​ ఆఫర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Flight Tickets | చాలా మంది పేద, మధ్య తరగతి వారు ఒక్కసారైనా విమానం ఎక్కాలని కలలు కంటారు. అయితే ఫ్లైట్​ టికెట్ల ధరలు (Flight Ticket Prices) చూసి వారు తమ కలలను వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ (Air India  Express) ప్రయాణికుల కోసం బంపర్​ ఆఫర్​ ప్రకటించింది.

దసర సందర్భంగా పేడే సేల్​ పేరిట ఎయిర్​ ఇండియా ప్రత్యేక స్కీమ్ (Special Scheem) తీసుకొచ్చింది. రూ.1,200 విమాన టికెట్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా కొంతకాలంగా ఎయిర్​ లైన్స్​ సంస్థలు ప్రయాణికులను ఆకట్టుకోవడానికి పండుగల సమయంలో ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు (domestic and international passengers) తక్కువ ధరల్లో టికెట్లు అందుబాటులో ఉందచింది.

Flight Tickets | పేడే సేల్​ లాంచ్​

ఎయిరిండియా లిమిటెడ్ సబ్సిడరీ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేడే సేల్ పేరిట ఆఫర్​ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీయ విమాన టికెట్​ ధరలు (domestic flight ticket prices) రూ.1,200 నుంచి ప్రారంభం అవుతాయి. ఎక్స్​ప్రెస్​ లైట్​ కింద ఈ ఆఫర్​ను ప్రవేశ పెట్టింది. లాగ్‌డ్-ఇన్- మెంబర్స్‌కు ఈ ఆఫర్​ వర్తిస్తుంది. ఇతరులకు ఎక్స్‌ప్రెస్ వాల్యూ పేరిట రూ.1,300 నుంచి టికెట్​ ధరలు ప్రారంభం అవుతాయి. దీనికోసం టికెట్లను ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 వరకు ఈ ఆఫర్​ అమలులో ఉంటుంది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 30 వరకు ప్రయాణం చేసే వారు అక్టోబర్​ 1లోపు టికెట్​ బుక్​ చేసుకుంటే ఈ ఆఫర్​ వర్తిస్తుంది.

Flight Tickets | అంతర్జాతీయ ఫ్లైట్​లకు..

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ ఆఫర్లు తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్ రూ. 3,724 నుంచి మొదలు అవుతాయి. ఎక్స్‌ప్రెస్ వాల్యూ రేట్లు రూ. 4,674 నుంచి అందుబాటులో ఉంటాయి. ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్, అఫీషియల్ యాప్ ద్వారా టికెట్లు బుక్​ చేసుకోవచ్చు. అయితే ముందుగా టికెట్లు బుక్​ చేసుకునే వారికి మాత్రమే ఆఫర్​ వర్తిస్తుంది.

Must Read
Related News