ePaper
More
    HomeFeaturesMobile Signal | వ‌ర్షాకాలంలో మొబైల్ సిగ్న‌ల్స్ రాక ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్...

    Mobile Signal | వ‌ర్షాకాలంలో మొబైల్ సిగ్న‌ల్స్ రాక ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..!

    Published on

    అక్షరటుడేర, వెబ్​డెస్క్ : Mobile Signal | వర్షాకాలం(Rainy Season)లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కారణంగా మొబైల్ టవర్స్ (Mobile Towers) నుంచి వచ్చే సిగ్నల్స్ బలహీనపడటం సాధారణమే. దీంతో మొబైల్ వినియోగదారులు కాల్స్ చేయడంలో, డేటా వాడకంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా, డేటాపై ఆధారపడే పనులు చేసే వారికి ఇది పెద్ద ఆటంకంగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు, మీ మొబైల్ సిగ్నల్(Mobile Signal)​ మరింత మెరుగుపడుతుంది.

    Mobile Signal | ఇవి పాటించండి..

    మీ ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఎరోప్లెయిన్​ మోడ్‌ను ఆన్ చేయండి. 10-15 సెకన్ల పాటు వేచి ఉండి మళ్లీ ఆఫ్ చేయండి. ఇది మీ ఫోన్ నెట్‌వర్క్ కనెక్షన్‌ను రీసెట్ చేసి, సమీప టవర్‌తో బలమైన కనెక్షన్ ఏర్పడేందుకు సహాయపడుతుంది. ఫోన్ అప్పుడప్పుడు 2G/3Gలోనే నిలిచిపోతుంటుంది. దీంతో సిగ్నల్ బలహీనమవుతుంది. ఈ క్రమంలో Settings > Mobile Network > Preferred Network Type కు వెళ్లి 4G లేదా 5G ఎంపిక చేసుకోండి. లేదంటే ‘Auto Mode’లో ఉంచడం వల్ల ఫోన్ బలమైన టవర్‌ను ఎంచుకుంటుంది. మాన్యువ‌ల్ నెట్​వ‌ర్క్ సెల‌క్ష‌న్ అయినట్లయితే Settings > Mobile Networks > Network Operators లోకి వెళ్లి, Search Networks ఎంచుకొని బలమైన నెట్‌వర్క్‌ను సెలెక్ట్ చేయవచ్చు.

    READ ALSO  Nisar Satellite | నింగిలోకి దూసుకెళ్లిన నిసార్​ ఉపగ్రహం.. ఇక ఆ ప్రమాదాలను ముందే గుర్తించొచ్చు

    సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, ఇంట్లో Wi-Fi ఉంటే Wi-Fi Calling ఆప్షన్‌ను సెట్టింగ్స్‌లో ఆన్ చేయండి. దీంతో మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేయడం, ఇంటర్నెట్ వాడడం సాధ్యమే. ఫోన్ రీస్టార్ట్ చేయడం ద్వారా సిగ్నల్ సమస్య తక్షణమే తీరే అవకాశం ఉంటుంది. ఇది నెట్‌వర్క్‌ను రీఫ్రెష్ చేస్తుంది. మీరు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తుంటే, వర్షాకాలంలో తరచూ సిగ్నల్ డ్రాప్ అనుభవిస్తుంటే.. Signal Booster లేదా Repeater కొనుగోలు చేసి ఇంట్లో ఏర్పాటు చేయండి. ఇది బలహీనమైన సిగ్నల్‌ను పటిష్టంగా మార్చి మంచి నెట్‌వర్క్ అందిస్తుంది. పాత సాఫ్ట్‌వేర్ వల్ల కూడా సిగ్నల్ సమస్యలు రావచ్చు. అప్పుడు Settings > Software Update కు వెళ్లి.. లేటెస్ట్ వర్షన్ ఉంటే అప్‌డేట్ చేయండి. సిమ్ కార్డు సరిగ్గా సెట్ కాకపోతే లేదా దుమ్ము చేరితే సిగ్నల్ డ్రాప్ కావచ్చు. అప్పుడు సిమ్ కార్డు తీసి, మృదువైన క్లాత్​తో శుభ్రం చేసి తిరిగి పెట్టండి. ఎన్ని ట్రిక్స్ ఉప‌యోగించిన సిగ్నల్ సమస్య కొనసాగితే మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. వారి పరిధిలో టవర్‌ సమస్య ఉంటే వెంట‌నే ప‌రిష్క‌రిస్తారు.

    READ ALSO  Moto G86 Power | భారీ బ్యాటరీతో మోటో ఫోన్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే..?

    Latest articles

    GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    అక్షరటుడే, హైదరాబాద్: GST fraud : తెలంగాణ(Telangana)లో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో...

    Officers Retirement | ఒకేసారి ఐదుగురు అధికారుల పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన ఆయా శాఖల సిబ్బంది

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Officers Retirement : నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు...

    Collector | కమ్మర్​పల్లి, మోర్తాడ్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector : కమ్మర్ పల్లి, మోర్తాడ్ (Mortad)మండల కేంద్రాలలో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...

    Task force raids | వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి.. పలువురి అరెస్టు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Task force raids : నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడులు...

    More like this

    GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    అక్షరటుడే, హైదరాబాద్: GST fraud : తెలంగాణ(Telangana)లో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో...

    Officers Retirement | ఒకేసారి ఐదుగురు అధికారుల పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన ఆయా శాఖల సిబ్బంది

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Officers Retirement : నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు...

    Collector | కమ్మర్​పల్లి, మోర్తాడ్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector : కమ్మర్ పల్లి, మోర్తాడ్ (Mortad)మండల కేంద్రాలలో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...