అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Drunk drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఐదుగురుకి జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ(Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Inspector Prasad) ఆధ్వర్యంలో బుధవారం నగరంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా.. 32మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి వారికి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం గురువారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరుపర్చగా ఇద్దరికి ఒకరోజు, ముగ్గురికి రెండు రోజులు జైలుశిక్ష విధించారు. 27మందికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఏసీపీ వివరించారు.
