ePaper
More
    HomeజాతీయంMaharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    Maharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Maharashtra | వరుస విషాదాలు దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే కేదార్​నాథ్​లో హెలికాప్టర్​ కూలి ఆరుగురు చనిపోయారు. మహారాష్ట్ర(Maharashtra)లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయి ఆరుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. తాజాగా సోమవారం లక్నోలో సౌదీ ఎయిర్​లైన్స్​ విమానం టైర్​కు నిప్పు అంటుకుంది. మరోవైపు మహారాష్ట్రలో ఓ రైలు(Train)లో మంటలు చెలరేగాయి. దీంతో వరుస ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    మహారాష్ట్రలోని దౌండ్ నుంచి పూణేకు వెళ్తున్న డెమూ రైలు(Demo train)లో సోమవారం ఉదయం మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు కోచ్‌లో వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు(Railway officers) సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...