ePaper
More
    HomeజాతీయంGaribhrath Express | గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. తప్పిన ప్రమాదం

    Garibhrath Express | గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. తప్పిన ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Garibhrath Express | గరీభ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాజస్థాన్‌(Rajasthan)లోని బీవర్ జిల్లా సెంద్ర రైల్వే స్టేషన్‌లో (Sendra Railway Station) శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రైలు ఇంజిన్​లో మంటలు చెలరేగాయి.

    లోకో పైలట్ (Loco Pilot) వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్​లో మంటలు అంటుకొని పొగలు బోగీలోకి వచ్చాయి. దీంతో ప్రయాణికులు లోకో పైలెట్​కు సమాచారం అందించారు. దీంతో ఆయన వెంటనే రైలును నిలిపివేశాడు. బోగీలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇంజిన్​ కాలిపోయింది.

    సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. రైల్వే అధికారులు (Railway Officers) ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సాంకేతిక లోపం లేదంటే ఇంజిన్‌లోని షార్ట్ సర్క్యూట్(Short Circuit)​తో మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

    More like this

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...