అక్షరటుడే, కామారెడ్డి: South Campus | తెయూ సౌత్ క్యాంపస్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్థి అశ్విని కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని తెయూ రిజిస్ట్రార్ యాదగిరికి (TU Registrar Yadagiri) విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.
క్యాంపస్కు వచ్చిన రిజిస్ట్రార్ను బీవీఎం(BVM), ఎస్ఎఫ్ఐ(SFI), పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సౌత్ క్యాంపస్లో కొన్నేళ్లుగా హెల్త్సెంటర్ నిర్వహించకపోవడం.. అంబులెన్స్ లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఆత్మహత్య చేసుకున్న అశ్విని అంబులెన్స్ అందుబాటులో ఉంటే బతికేదన్నారు. వెంటనే క్యాంపస్లో హెల్త్ సెంటర్ (Health Center) ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, క్యాంపస్లో మిగితా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన అశ్విని కుటుంబానికి రూ. 20లక్షల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేష్, బీవీఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్, కార్యదర్శి బుల్లెట్, నాయకులు, నవీన్, ప్రభాకర్, మణికంఠ, విద్యార్థులు పాల్గొన్నారు.