ePaper
More
    HomeతెలంగాణGurukul School | గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

    Gurukul School | గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gurukul School | గురుకుల పాఠశాలల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐదో తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్‌ మండలం తుప్రాన్‌పేట (Tupranpet)లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

    మహబూబ్‌నగర్‌ జిల్లా (Mahabubnagar District)కు చెందిన సంధ్య తూప్రాన్‌పేటలోని జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల (Jyotibapule Gurukul School)లో ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల ఇంటికి వెళ్లిన ఆమె ఆదివారం పాఠశాలకు తిరిగి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం హాస్టల్‌ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    READ ALSO  Railway Minister | కేంద్రం గుడ్​న్యూస్​.. కాజీపేట నుంచి బల్లార్ష మార్గంలో నాలుగో లైన్​

    Gurukul School | ప్రభుత్వ వైఫల్యమే కారణం

    గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యపై మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR)​ స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు కాంగ్రెస్ సర్కార్ (Congress Government) వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. పురుగుల అన్నం తినలేక అవస్థలు పడుతున్న చిన్నారులు, కనీస సౌకర్యాలు లేని హాస్టల్​లో ఉండలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే గురుకులాల్లో 90 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించినా ముఖ్యమంత్రికి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Latest articles

    Diarrhea cases | డయేరియా కేసులు అదుపులోనే ఉన్నాయి : కామారెడ్డి ఆర్డీఓ వీణ

    అక్షరటుడే, కామారెడ్డి : Diarrhea cases : డయేరియా కేసులు అదుపులోనే ఉన్నాయని, కొత్తగా ఎలాంటి కేసులు నమోదు...

    Contract employees | కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు గుడ్​న్యూస్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Contract employees | ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​...

    Mir Alam Tank | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మీరం ఆలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.430 కోట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mir Alam Tank | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (Hyderabad)​...

    Maoists | భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో (Operation Kagar) కలవరపడుతున్న మావోయిస్టులను లొంగుబాట్లు...

    More like this

    Diarrhea cases | డయేరియా కేసులు అదుపులోనే ఉన్నాయి : కామారెడ్డి ఆర్డీఓ వీణ

    అక్షరటుడే, కామారెడ్డి : Diarrhea cases : డయేరియా కేసులు అదుపులోనే ఉన్నాయని, కొత్తగా ఎలాంటి కేసులు నమోదు...

    Contract employees | కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు గుడ్​న్యూస్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Contract employees | ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​...

    Mir Alam Tank | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మీరం ఆలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.430 కోట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mir Alam Tank | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (Hyderabad)​...