More
    Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | ఫీజు​ రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు తక్షణమే అందజేయాలి

    Telangana University | ఫీజు​ రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు తక్షణమే అందజేయాలి

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | పెండింగ్​లో ఉన్న రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ (ABVP Telangana University) నాయకులు డిమాండ్​ చేసింది. ఈ సందర్భంగా సోమవారం తెయూ గేట్​ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి సమీర్​ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అవలంభిస్తోందని దుయ్యబట్టారు.

    విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్​మెంట్​ (fee reimbursement), స్కాలర్​షిప్​లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు కళాశాలల్లో తరగతులకు హాజరుకాలేకపోతున్నారని వాపోయారు. ఎన్నికల సమయంలో మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు.

    కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ తెలంగాణ సమాజాన్ని నమ్మిస్తూ రోజులు గడుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విద్యార్థి లోకం హెచ్చరిస్తోందని స్పష్టం చేశారు. విద్యాశాఖను తనవద్దే ఉంచుకుని విద్యార్థులను అవస్థల పాలు చేయడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. కార్యక్రమంలో తెయూ ఏబీవీపీ నాయకులు అక్షయ్, అశోక్, మనోజ్, అనిల్, అఖిల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

    More like this

    KTR meets medical students | మెడికల్ విద్యార్థులతో కేటీఆర్ భేటీ.. కొత్త స్ధానికత జీవోపై చర్చ.. జరుగుతున్న నష్టంపై ఆవేదన

    అక్షరటుడే, హైదరాబాద్: KTR meets medical students | తెలంగాణలో కొత్త స్ధానికత జీవో కారణంగా నష్టపోతున్న మెడికల్...

    Nizamabad | వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీపేట (Navipet)...

    Tirumala | తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు....