Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​కు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై దాడి

అక్షరటుడే, వెబ్​డెస్క్:Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​ కుబుంబాల్లో చిచ్చు పెడుతోంది. ఈజీ మనీ(Easy Money) కోసం బెట్టింగ్​ బానిసై ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు అప్పులు చేసి తనువు చాలిస్తుండగా.. మరి కొందరు కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లా(Jagityala District)లో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత కోర్టు భవనం సమీపంలో రాచకొండ దేవభూమయ్య (62) అనే వ్యక్తి తన కుమారుడు నవీన్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​ కుబుంబాల్లో చిచ్చు పెడుతోంది. ఈజీ మనీ(Easy Money) కోసం బెట్టింగ్​ బానిసై ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు అప్పులు చేసి తనువు చాలిస్తుండగా.. మరి కొందరు కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లా(Jagityala District)లో చోటు చేసుకుంది.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత కోర్టు భవనం సమీపంలో రాచకొండ దేవభూమయ్య (62) అనే వ్యక్తి తన కుమారుడు నవీన్ (33) నివాసముంటున్నారు. అయితే నవీన్​ కొంత కాలంగా మద్యం, ఆన్​లైన్​ బెట్టింగ్(Online Betting)​కు బానిసయ్యాడు. బెట్టింగ్​ డబ్బులు పోగొట్టుకున్నాడు.

ఈ క్రమంలో గురువారం బెట్టింగ్​ కోసం డబ్బులు కావాలని తండ్రిని అడిగాడు. లేవని చెప్పడంతో నవీన్ తన​ తండ్రిపై కత్తితో దాడి చేశాడు. అయితే ఈ సందర్భంగా జరిగిన గొడవలో తండ్రీకొడుకులు ఇద్దరికి గాయాలు అయ్యాయి. దేవభూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు(Police) తెలిపారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...