ePaper
More
    HomeజాతీయంWarangal | ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ.. ముగ్గురి సజీవ దహనం

    Warangal | ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ.. ముగ్గురి సజీవ దహనం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Warangal : ఖమ్మం – వరంగల్​ 563 నేషనల్​ హైవే(National Highway 563)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) మరిపెడ మండలం పరిధిలో ఉన్న రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ఢీ కొనడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు.

    Warangal : బలంగా ఢీకొనడంతో..

    కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్తున్న గ్రానైట్ లారీ.. విజయవాడ(Vijayawada) నుంచి వరంగల్​(Warangal)కు చేపల దానా (fish feed) తీసుకొస్తున్న మరో లారీ ఢీకొన్నాయి. మరిపెడ పట్టణ శివారు కుడియా తండా వద్ద ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడడంతో రెండు లారీల క్యాబిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో రెండు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ సజీవంగా దహనమాయ్యారు.

    ముగ్గురి మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా మారాయి. పోలీసులు POLICE ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను రాజస్థాన్​(Rajasthan)కు చెందిన డ్రైవరు, క్లీనరు​ సర్వర్ రామ్, బర్గత్​ అలీగా.. ఇంకో డ్రైవరును వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...