అక్షరటుడే, కామారెడ్డి : kamareddy : కామారెడ్డి జిల్లాలో రైతులు Farmers, వ్యవసాయ కార్మికులు agricultural workers వాగులో చిక్కుకుపోయారు. వ్యవసాయ పనులు ముగించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల వల్ల వాగు ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించడంతో ఐదుగురు అందులో చిక్కుకుపోయారు.
శనివారం (జులై 19) రాత్రి సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. సమాచారం అందుకున్న గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చీకట్లోనే ట్రాక్టర్ సాయంతో వారిని బయటకు సురక్షితంగా తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.