Homeజిల్లాలుకామారెడ్డిPaddy Purchasing Centers | రైతులపై నిర్లక్ష్యం తగదు

Paddy Purchasing Centers | రైతులపై నిర్లక్ష్యం తగదు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Paddy Purchasing Centers | రైతులపై అధికారుల నిర్లక్ష్యం తగదని బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. బుధవారం మహమ్మద్ నగర్(Mohammed Nagar) మండలంలోని నర్వ గ్రామంలో పర్యటించి వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్​ కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనాలని డిమాండ్​ చేశారు. ధాన్యాన్ని రైసుమిల్లులకు(Rice mills) తరలించేలా చూడాలని సొసైటీ సీఈవో రాములు, డిప్యూటీ తహశీల్దార్​కు సూచించారు. ఆయన వెంట నాయకులు హైమారెడ్డి, రాములు, రాజు తదితరులున్నారు.