HomeతెలంగాణArmoor | తడిసిన ధాన్యంతో రైతుల రాస్తారోకో

Armoor | తడిసిన ధాన్యంతో రైతుల రాస్తారోకో

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Armoor | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్​ పట్టణంలోని నిజాంసాగర్​ కెనాల్​పై (Nizamsagar Canal) అన్నదాతలు గురువారం రాస్తారోకో చేశారు. మెప్మా సెంటర్​లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని వారు పేర్కొన్నారు.

రైతులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్న కిసాన్​ మోర్చా రాష్ట్ర (State Kisan Morcha) నాయకుడు నూతల శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నా ఇప్పటివరకు అధికారులు పరిశీలనకు రాలేదన్నారు. అనంతరం ఆర్మూర్​ ఏసీపీ వెంకటేశ్వర్​రెడ్డి (ACP Venkateswar Reddy of Armor) ఆర్డీవో రాజాగౌడ్​తో (RDO Rajagoud) మాట్లాడి రెండు రోజుల్లో తూకాలు వేసి ధాన్యం మొత్తాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

Must Read
Related News