ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Rythu Bharosa | రైతు భరోసా నిధులు రూ.214 కోట్లు విడుదల

    Rythu Bharosa | రైతు భరోసా నిధులు రూ.214 కోట్లు విడుదల

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Raithu Barosa | రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,38,247 మంది రైతుల ఖాతాల్లో 214.56 కోట్ల నిధులు జమ చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. వానాకాలం సీజన్​కు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద మొత్తం 2,98,472 మంది రైతులకు రూ.326.03 కోట్ల నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఈ నెల 16న రెండు ఎకరాలలోపు వ్యవసాయ భూమి కలిగిన వారికి ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.95.66 కోట్లు, 17వ తేదీన మూడెకరాల వరకు సాగు భూమి ఉన్నవారికి రూ.65.06 కోట్లు, 18, 19వ తేదీల్లో ఐదెకరాల లోపు సాగు భూమి కలిగిన వారికి రూ.53.84 కోట్ల నిధులు జమ చేసినట్లు వివరించారు. అలాగే కొత్త పాస్ బుక్కులు వచ్చినవారు వ్యవసాయ విస్తీర్ణాధికారులను కలిసి సరైన పత్రాలను సమర్పించాలని సూచించారు. వాడుకలో ఉన్న బ్యాంకు అకౌంట్​ నెంబర్లను అందించాలని తెలిపారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....