HomeతెలంగాణFalaknuma Express | మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​

Falaknuma Express | మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​

హౌరా నుంచి సికింద్రాబాద్​ వెళ్తున్న ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ సాంకేతిక లోపంతో మిర్యాలగూడ స్టేషన్​లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : Falaknuma Express | నల్గొండ (Nalgonda) జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్​ (Miryalaguda Railway Station)లో ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హౌరా నుంచి సికింద్రాబాద్​ వెళ్తున్న ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఎంతకు రైలు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంజిన్​లో లోపం తలెత్తడంతో రైలు ఆగిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. సుమారు గంట సేపటి నుంచి రైలు అక్కడే నిలిచిపోయింది. దీంతో రైల్వే అధికారులు మరో ఇంజిన్​ తెప్పించేందుకు చర్యలు చేపట్టారు.