HomeతెలంగాణFake junior lecturers | 375 మంది జూనియర్ అధ్యాపకుల తొలగింపునకు రంగం సిద్ధం

Fake junior lecturers | 375 మంది జూనియర్ అధ్యాపకుల తొలగింపునకు రంగం సిద్ధం

అక్షరటుడే, హైదరాబాద్​: Fake junior lecturers | ఫేక్​ సర్టిఫికెట్లతో జూనియర్​ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందిన వారిపై వేటు పడబోతోంది. వారిని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది.

ఈ కేసులో Feb 11, 2005 న ప్రొఫెసర్ యష్పాల్ వర్సెస్​ స్టేట్ ఆఫ్ ఛత్తీస్​గఢ్​ కేసులో సుప్రీం కోర్టు Supreme Court ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుంటున్నారు.

దీని ప్రకారం.. 2005 తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​కు చెందని ప్రైవేటు యూనివర్సిటీల నుంచి దూరవిద్య, రెగ్యులర్​ కేటగిరీల్లో పట్టాలు పొందినవారిని తొలగించే అవకాశం ఉంది.

Fake junior lecturers | టీచింగ్​, నాన్​ టీచింగ్​..

రాష్ట్రంలో ఇలాంటివారు సుమారు 375 మంది జూనియర్ అధ్యాపకులు (రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ 10% కోటాలో నియమితులైన అధ్యాపకులతో సహా) ఉన్నారు.

వీరందరినీ ఇంటర్ విద్యా శాఖ ఉద్యోగాల నుంచి తొలగించనుంది. ఈ మేరకు Intermediate Board కమిషనర్ డా. పీ మధుసూదన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

Fake junior lecturers | బయట పడింది ఇలా..

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూన్ 2, 2014 నాటికి పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల lecturers ను మే, 2023 లో అప్పటి ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.

అలా మొత్తం 3,125 మంది కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులర్​ అయ్యారు. వీరిలో 189 మంది ఒకేషనల్ లెక్చరర్లు ఉన్నారు.

కాగా, ఇందులో చాలా మంది ఫేక్​ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

దీంతో అప్పట్లోనే సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ చేపట్టి కొందరిని తొలగించారు. ప్రస్తుతం వారి ప్రొబేషన్ పీరియడ్ పూర్తికావడంతో ఇంటర్మీడియెట్ బోర్డు మరోసారి వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది.

ఈ క్రమంలో కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగులు పొందినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ మేరకు వారిని తొలగించాలని ఇంటర్​ బోర్డు కమిషనర్​ అడుగులు వేస్తున్నారు.

Must Read
Related News