HomeజాతీయంFake IAS officer arrested | ఆరేళ్ల సీబీ సీఐడీ వేటకు తెర.. రూ.80 కోట్లు...

Fake IAS officer arrested | ఆరేళ్ల సీబీ సీఐడీ వేటకు తెర.. రూ.80 కోట్లు స్వాహా చేసిన నకిలీ ఐఏఎస్​ అధికారి అరెస్టు

fake IAS officer arrested | ఐఏఎస్ (IAS) అధికారిగా చెప్పుకొంటూ సుప్రీంకోర్టు న్యాయవాదితో సహా ఎందరినో మోసగించి, ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కేటుగాడు వివేక్​ మిశ్రా ఎట్టకేలకు పట్టుబడ్డాడు. లక్నో పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: fake IAS officer arrested | ఐఏఎస్ (IAS) అధికారిగా చెప్పుకొంటూ సుప్రీంకోర్టు న్యాయవాదితో సహా ఎందరినో మోసగించి, ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కేటుగాడు వివేక్​ మిశ్రా ఎట్టకేలకు పట్టుబడ్డాడు. లక్నో పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు.

సుప్రీంకోర్టు న్యాయవాది అశుతోశ్ మిశ్రా ఫిర్యాదు ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఓసారి పరిశీలిస్తే.. నిందితుడు వివేక్​ మిశ్రా పలువురికి 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడు. గుజరాత్ సర్కారులో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నట్లుగా చెప్పుకొనేవాడు.

Fake IAS officer arrested | నిజమైన అధికారుల పేర్లు వాడుకుంటూ..

తన సిస్టర్స్​ గుజరాత్ కేడర్ ఐపీఎస్ (IPS) అధికారులుగా నమ్మబలికేవాడు. వాట్సప్ గ్రూపులు, సోషల్ మీడియాల్లో  నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి.. అమ్మాయిలను టార్గెట్​ చేసేవాడు.

అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించేవాడు. వారి కుటుంబీకులను సంప్రదించి సర్కారు కొలువులు ఇప్పిస్తానని ప్రలోభపెట్టి డబ్బులు లాగేవాడు. అతగాడిని పూర్తిగా నమ్మేలా నిజమైన ఐఏఎస్, ఐపీఎస్​ల పేర్లను తన పేరుగా వాడుకున్నాడు.

2018 జూన్​లో సుప్రీంకోర్టు Supreme Court న్యాయవాది అశుతోశ్ మిశ్రాకు ఈ మోసగాడైన వివేక్​ పరిచయం అయ్యాడు. అశుతోశ్​కు ప్రభుత్వ ఉద్యోగ ఇప్పిస్తానని నమ్మించాడు. గుజరాత్ Gujarat హోం మినిస్ట్రీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, డిప్యూటీ ఎస్పీ (స్పోర్ట్స్ కోటా) పోస్టుల నియామక పత్రాలు కూడా ఇచ్చాడు.

ఆ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే నకిలీవి అని తేలింది. దీంతో 2019లో చిన్హాట్ పోలీస్ స్టేషన్​లో అశుతోశ్ మిశ్రా ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు.. నిందితుడు వివేక్ మిశ్రాపై కేసు చేశారు.

దర్యాప్తును సీఐడీ (CID)కి ట్రాన్స్​ఫర్​ చేశారు. కాగా, నిందితుడు ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసుల దర్యాప్తులో వివేక్ ఇప్పటి వరకు 150 మందికి పైగా అమాయకులను మోసగించినట్లు తేలింది. వారి వద్ద నుంచి రూ.80 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా తెలిసింది.

కాగా, నిందితుడి కోసం ఓ వైపు సీఐడీ అధికారులు వెతుకుతుంటే.. లక్నో పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించారు.