ePaper
More
    HomeజాతీయంMaharashtra | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. బాల్​ఠాక్రే చేయలేని పని ఫడ్నవీస్​ చేశారు..

    Maharashtra | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. బాల్​ఠాక్రే చేయలేని పని ఫడ్నవీస్​ చేశారు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maharashtra | మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్న రాజ్​ ఠాక్రే(Raj Thackeray), ఉద్దవ్​ ఠాక్రే(Uddhav Thackeray) ఒకే వేదికపై కలిశారు. బాల్​ఠాక్రే సోదరుడి కుమారుడైన రాజ్​ ఠాక్రే గతంలో శివసేనలో కీలకంగా ఉండేవారు. అయితే బాల్​ఠాక్రే(Bal Thackeray) తన కుమారుడైన ఉద్దవ్​ ఠాక్రేకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో శివసేన నుంచి 2005లో బయటకు వచ్చిన ఆయన సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ్​సేన (MNS) అనే పార్టీని స్థాపించారు. అప్పుడు విడిపోయిన రాజ్​ఠాక్రే, ఉద్దవ్​ ఠాక్రే 20 ఏళ్ల తర్వాత మళ్లీ శనివారం కలుసుకోవడం గమనార్హం.

    మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) ఇటీవల రాష్ట్రంలో త్రిభాష విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. హిందీని తప్పనిసరిగా చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎంఎన్ఎస్​ అధినేత రాజ్​ఠాక్రేతో పాటు శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్​ ఠాక్రే, మహా వికాస్​ అఘాడీ నేతలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో ఠాక్రే సోదరులు ఇది తమ విజయంగా పేర్కొంటు శనివారం వాయిస్​ ఆఫ్​ మరాఠీ(Voice of Marathi) కార్యక్రమం నిర్వహించారు.

    Maharashtra | ఆయన చేయలేకపోయారు..

    సమావేశంలో రాజ్​ఠాక్రే మాట్లాడుతూ.. తమ పెద్ద నాన్న బాల్​ ఠాక్రే చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis)​ చేశారన్నారు. తమ ఇద్దరు సోదరులనున కలపాలని బాల్​ఠాక్రే ఎన్నో ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. అయినా తాము 20 ఏళ్లుగా కలవలేదన్నారు. అయితే తాజాగా ఫడ్నవీస్​ తమను కలిపారని సెటైర్లు వేశారు. రెండు దశాబ్దాల తర్వాత సోదరులు కలుసుకోవడం మహా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.

    Maharashtra | రాజ్​ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

    ఇటీవల మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడని వారిపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై రాజ్​ఠాక్రే స్పందించారు. మరాఠీ మాట్లాడని వారిపై దాడులు సరికాదన్నారు. అలాగే తమ భాషను అవమానిస్తే బుద్ధి చెప్పాలని ఎంఎన్​​ఎస్​ కార్యకర్తలకు సూచించారు. అంతేగాకుండా ‘‘మీరు ఏం చేసినా వీడియోలు రికార్డు చేయొద్దు.. కెమెరాల కంట పడకుండా ఉండాల’’ని ఆయన సూచించడం గమనార్హం. మరోవైపు మరాఠీ అంశంపై రాజ్ ఠాక్రేను ప్రశ్నించినందుకు ఎంఎన్ఎస్​ కార్యకర్తలు సుశీల్ కేడియా కార్యాలయం (Sushil Kedia Office)పై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్​ చేశారు. తమకు హిందీపై ద్వేషం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే బలవంతంగా ఆ భాషను తమపై రుద్దితే ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్​ఠాక్రే, ఉద్దవ్​ ఠాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్ర, మరాఠీ ప్రజల ప్రయోజనాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. తాము కలిసి ఉండటానికి ఒకే వేదికపైకి వచ్చామని పేర్కొన్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...