Telangana University
Telangana University | తెయూ ఆవరణలో విత్తనాలు నాటిన అధ్యాపకులు

అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలోని (Telangana University) ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (College of Arts and Science) ఆవరణలో అధ్యాపకులు పండ్ల మొక్కల విత్తనాలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్​ డాక్టర్​ మామిడాల ప్రవీణ్​కుమార్​ హాజరై మాట్లాడారు.

భాషా శాస్త్ర విభాగాల వారీగా పండ్ల మొక్కల విత్తనాలను నాటడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అడవులు ఉంటేనే వర్షాలు సుభిక్షంగా కురుస్తాయని ఆయన వివరించారు. హిందీ, తెలుగు, ఇంగ్లిష్​ ఉర్దూ విభాగాల ఆధ్వర్యంలో బుధవారం అధ్యాపకులు పనస, బత్తాయి విత్తనాలను నాటారు. కార్యక్రమంలో భాషా శాస్త్ర విభాగాల అధ్యాపకులు డి.కనకయ్య, మూసా ఖురేషి, జమీల్ అహ్మద్, తాహెర్, అశోక్ చౌహన్, నాన్ టీచింగ్ సిబ్బంది సుధీర్, సురేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.