అక్షర టుడే, వెబ్డెస్క్: Eye medical camp | మత్తమాలలో పీహెచ్సీ (Mattamala PHC) ఆధ్వర్యంలో శుక్రవారం కంటి వైద్యశిబిరం (Eye Medical Camp) నిర్వహించారు. ఈ సందర్భంగా 56 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఎనిమిది మందికి కేటరాక్ట్ ఆపరేషన్ నిమిత్తం రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే 19 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. మిగిలినవారిని సరోజని దేవి ఆస్పత్రికి (Sarojani Devi Hospital) రిఫర్ చేసినట్లు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ శరత్ తెలిపారు. శిబిరంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్రావు, హెచ్ఈవో జనార్దన్, రాణి తదితరులున్నారు.