Medaram Jathara | మేడారం జాతరకు కుంభమేళా స్థాయిలో ఏర్పాట్లు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Medaram Jathara | మేడారం మహా జాతరకు కుంభమేళా స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. శాసనమండలిలో సోమవారం మంత్రి మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మ జాతర (Sammakka-Saralamma Jatara) కోసం రూ.200 కోట్లకు పైగా విలువైన పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. వాటిలో దాదాపు 95 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఈ పనులలో 200 సంవత్సరాలకు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Medaram Jathara | మేడారం మహా జాతరకు కుంభమేళా స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు.

శాసనమండలిలో సోమవారం మంత్రి మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మ జాతర (Sammakka-Saralamma Jatara) కోసం రూ.200 కోట్లకు పైగా విలువైన పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. వాటిలో దాదాపు 95 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఈ పనులలో 200 సంవత్సరాలకు పైగా మన్నిక ఉండేలా రూపొందించిన రాతి కట్టడాలు, 10 కిలోమీటర్ల పరిధిలో నాలుగు వరుసల రహదారుల నిర్మాణం, 29 ఎకరాల భూసేకరణ వంటివి ఉన్నాయన్నారు. యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి అదనంగా మరో 63 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 29 నుంచి 31 వరకు జరగనున్న ఈ జాతర కోసం కుంభమేళాకు (Kumbh Mela) సమానమైన స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Medaram Jathara | 18న సీఎం రాక

మంత్రులు సీతక్క (Minister Seethakka), కొండా సురేఖతో (Minister Konda Surekha) కలిసి మేడారం పనులను పర్యవేక్షిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఈ నెల 18న మేడారం వస్తారని చెప్పారు. పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

Medaram Jathara | చారిత్రక నేపథ్యం మేరకు..

మేడారం జాతర (Medaram Jathara) విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించి, గిరిజన, ఆదివాసీ పూజారుల సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కావాలనే కొంతమంది నాయకులు, కొన్ని పత్రికలు గిరిజన ఆచారానికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుళ్ల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది ఒడ్డున గల దేవాలయాలను ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ప్రకటించారు.

Related articles

Maoist Movement End Phase | ముగిసిన మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ...

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...