Hyderabad
Hyderabad | పేలిన ఫోన్​.. యువకుడి సజీవ దహనం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | మొబైల్​ ఫోన్​(Mobile Phone) పేలి ఓ యువకుడు సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని జగద్గిరిగుట్ట రింగ్​ బస్తీ(Jagadgirigutta Ring Basti)లో చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉండే సాయి ఛార్జింగ్​ పెట్టి ఫోన్​ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు అంటుకొని సాయి సజీవ దహనం అయ్యాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

కాగా.. దేశంలో ఇటీవల ఫోన్​ పేలుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వేగంగా ఫోన్​ ఛార్జ్​ కావడానికి అల్ట్రాఫాస్ట్​ ఛార్జర్లు(Ultrafast chargers) అందుబాటులోకి వచ్చాయి. అయితే వేగంగా ఛార్జింగ్​ అవుతున్న క్రమంలో ఫోన్లు వేడుక్కుతున్నాయి. ఈ క్రమంలో ఫోన్లు పేలిపోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఫోన్​ ఛార్జింగ్(Phone charging)​ పెట్టిన సమయంలో ఆపరేట్​ చేయొద్దని సూచిస్తున్నారు. అలాగే ఫోన్​ బ్యాక్​ కవర్​లో డబ్బులు, ఇతర పేపర్లు పెట్టొద్దని చెబుతున్నారు. వాటిమూలంగా కూడా ఫోన్లు హీట్​ అవుతాయని పేర్కొంటున్నారు.