అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Medicover Hospitals | నిత్యం వ్యాయామం.. సమతుల ఆహారంతోనే గుండె పదిలంగా ఉంటుందని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి(Additional DCP Baswareddy) పేర్కొన్నారు. నగరంలోని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సోమవారం 2కే రన్ నిర్వహించారు.
ఈ రుక్మిణి ఛాంబర్స్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయన్నారు.చిన్న వయస్సులోనే హార్ట్ ప్రాబ్లమ్స్(Heart Problems) రావడం ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. ఇలాంటి రన్లు నిర్వహించడం వల్ల ప్రజల్లో హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఉపయోగపడతాయన్నారు. ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospital)ను అభినందించారు.
Medicover Hospitals | ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించవద్దు..
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సదానంద రెడ్డి మాట్లాడుతూ హార్ట్ ఎటాక్లు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. హెల్త్ చెకప్స్ చేయించుకోకపోవడం.. బరువు నియంత్రణ, జంక్ ఫుడ్ నివారణ, నియమిత వ్యాయామం, ధూమపానం – మద్యపానం దూరం పెట్టడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరమని తెలిపారు.
Medicover Hospitals | ఫిజికల్ యాక్టివిటీ తగ్గడంతో..
కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ రావు మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, రాత్రి నిద్రలేమి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల యువతలో హృదయ సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం, పండ్లు–కూరగాయలు తీసుకోవడం, తగినంత నీరు తాగడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. కార్డియాలజిస్టులు డాక్టర్ జగదీష్ చంద్ర బోస్, డాక్టర్ వారిస్ అలీ కూడా కార్యక్రమంలో పాల్గొని గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆస్పత్రి డాక్టర్లు, యాజమాన్యం, సిబ్బంది కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.