అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet | లింగంపేట మండలం షెట్పల్లి సంగారెడ్డి (Shetpalli Sangareddy) గ్రామంలో శనివారం దుర్గమ్మకు (Goddess Durga), పోచమ్మ దేవతలకు ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో ఎడ్లబండ్లను రంగురంగు చీరలతో, మామిడి తోరణాలతో అలంకరించి ఆలయాల చుట్టూ ప్రదర్శన చేపట్టారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల విన్యాసాలు ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. ప్రతి ఏటా దుర్గమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
Lingampet | ఉత్సాహంగా ఎడ్లబండ్ల ప్రదర్శన
- Advertisement -
