HomeతెలంగాణKaleshwaram Commission | ‘కాళేశ్వరం’ విచారణపై ఉత్కంఠ.. రేపు కమిషన్​ ముందుకు ఈటల

Kaleshwaram Commission | ‘కాళేశ్వరం’ విచారణపై ఉత్కంఠ.. రేపు కమిషన్​ ముందుకు ఈటల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్​ఎస్(BRS)​ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ (Congress)​ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్​లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జస్టిస్​ పీసీ ఘోష్(PC Gosh)​ కమిషన్​ ఏర్పాటు చేసింది.

Kaleshwaram Commission | ఈటల ఏం చెప్పనున్నారు..

బీఆర్​ఎస్​ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్​కు అంకురార్పణ జరిగింది. ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్(Etala Rajender)​, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఉన్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్​ మాజీ సీఎం కేసీఆర్​తో పాటు, ఈటల, హరీశ్​ రావుకు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా జూన్ ​6న ఈటల కమిషన్​ ముందు హాజరు కానున్నారు. ఈటల ప్రస్తుతం బీజేపీ(BJP)లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్​ విషయంలో కమిషన్​ ముందు ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.

Kaleshwaram Commission | కేసీఆర్​ ఆదేశాల మేరకే నిర్ణయాలు

కాళేశ్వరం కమిషన్​ ఇప్పటికే 200 మంది అధికారులను, 25 మంది ఐఏఎస్ అధికారులను విచారించింది. బ్యారేజీల నిర్మాణ సంస్థలు, ఇంజినీర్లు, కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను పరిశీలించింది. కేసీఆర్​ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు కమిషన్​ ఎదుట చెప్పారు. దీంతో ఆయన వివరణ తీసుకోవడంతో పాటు ఆ సమయంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈటల, హరీశ్​రావును విచారించేందుకు కమిషన్​ నోటీసులు ఇచ్చింది.

Kaleshwaram Commission | తుది నివేదిక అప్పుడే..

కాళేశ్వరం కమిషన్​ గడువు ముగిసింది. అయితే విచారణ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ క్రమంలో ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్​కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన జూన్​ 11న హాజరవుతానని కమిషన్​కు తెలుపగా.. కమిషన్​ అంగీకరించింది. శుక్రవారం ఈటల విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 9న హరీశ్​రావును కమిషన్​ ప్రశ్నించనుంది. వీరి వాంగ్మూలం సేకరించి జూన్​ 30 నాటికి తుది నివేదిక సమర్పించాలని కమిషన్​ యోచిస్తోంది.