ex-railway-minister mukul roy | విషాదం.. గుండెపోటుతో రైల్వే మాజీ మంత్రి కన్నుమూత

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ex-railway-minister mukul roy | పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (71) సోమవారం తెల్లవారుజామున కోల్‌కతాలో గుండెపోటుతో కన్నుమూశారు. టీఎంసీలో నంబర్-2గా ఎదిగి, తర్వాత బీజేపీ చేరి మళ్లీ సొంత గూటికి చేరిన ఆయన రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులతో సాగింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత ముకుల్ రాయ్ సోమవారం (ఫిబ్రవరి 23) తెల్లవారుజామున కోల్‌కతాలో తుదిశ్వాస […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ex-railway-minister mukul roy | పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (71) సోమవారం తెల్లవారుజామున కోల్‌కతాలో గుండెపోటుతో కన్నుమూశారు. టీఎంసీలో నంబర్-2గా ఎదిగి, తర్వాత బీజేపీ చేరి మళ్లీ సొంత గూటికి చేరిన ఆయన రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులతో సాగింది.

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత ముకుల్ రాయ్ సోమవారం (ఫిబ్రవరి 23) తెల్లవారుజామున కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. సాల్ట్ లేక్‌లోని అపోలో ఆసుప‌త్రి Apollo Hospital – Salt Lakeలో చికిత్స పొందుతూ రాత్రి 1:30 గంటల సమయంలో మరణించినట్లు ఆయన కుమారుడు శుభ్రాంగ్షు రాయ్ ధృవీకరించారు.

గత కొన్ని ఏళ్లుగా ముకుల్ రాయ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2023లో ఆయనకు డిమెన్షియా, పార్కిన్సన్స్ వ్యాధులు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అదే సంవత్సరం మార్చిలో హైడ్రోసిఫలస్ కారణంగా మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 2024 జులైలో ఇంట్లో జారి పడటంతో తలకు గాయమై మరోసారి సర్జరీ చేయించుకున్నారు. దీర్ఘకాలిక మధుమేహం, శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.

ex-railway-minister mukul roy | టీఎంసీలో వ్యూహకర్తగా ఎదుగుదల

మ‌మ‌తా బెన‌ర్జీ Mamata Banerjee నాయకత్వంలోని ఆల్ ఇండియా తృణ‌ముల్ కాంగ్రెస్‌ All India Trinamool Congress (టీఎంసీ)లో ఒకప్పుడు అత్యంత ప్రభావవంతమైన నేతగా ముకుల్ రాయ్ గుర్తింపు పొందారు. 2011లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలకడంలో ఆయన వ్యూహాత్మక పాత్ర కీలకమైంది. 2012లో యూపీఏ-2 ప్రభుత్వంలో దినేష్ త్రివేది స్థానంలో దేశ 32వ రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 20 నుంచి సెప్టెంబర్ 21, 2012 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.

నారద స్టింగ్ ఆపరేషన్ వివాదం తర్వాత టీఎంసీలో ఆయన ప్రభావం తగ్గింది. 2017లో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన, నవంబర్ 2017లో బీజేపీ లో చేరారు. 2020లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఎన్నికల అనంతరం మళ్లీ టీఎంసీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పార్టీ ఫిరాయింపుపై దాఖలైన కేసులో కోల్‌కతా హైకోర్టు ఆయన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. అయితే 2026 జనవరి 16న సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే విధించింది. ఎలక్ట్రానిక్ ఆధారాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది.

ఈ న్యాయపోరాటం కొనసాగుతుండగానే ఆయన మృతి చెందారు. ముకుల్ రాయ్ మృతి పట్ల బెంగాల్ Bengal రాజకీయ వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ‘బెంగాల్ చాణిక్యుడు’గా పేరొందిన ఆయన మరణం రాష్ట్ర రాజకీయాల్లో ఒక శకానికి ముగింపు పలికిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related articles

Tirumala Snake Bite | తిరుమల రూ.300 క్యూలైన్‌లో పాము కలకలం.. భక్తురాలిని కాటు వేయ‌డంతో ఐసీయూలో చికిత్స

తిరుమల శ్రీవారి దర్శనానికి వ‌చ్చిన భక్తురాలిని పాము కాటేయడంతో కలకలం రేగింది. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి అశ్విని ఆసుపత్రికి తరలించగా, అనంతరం స్విమ్స్‌లో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

RTC Bus Falls Into Valley | లోయలో పడిన బస్సు : ప్రయాణికులకు గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

India Semi Chances | సూపర్ 8లో టీమిండియాకు భారీ షాక్.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేదా?

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీ 20 సూపర్ 8 దశలో భార‌త జ‌ట్టుకు గట్టి దెబ్బ తగిలింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసినా, సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా ముగియలేదు. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పక విజయం సాధించాల్సిందే.

Feb 23 Gold Prices | బంగారం, వెండి ధరలలో స్వల్ప తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 23 Gold Prices | బంగారం, వెండిధ‌ర‌లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ బంగారం ధరలు ఇంకా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి....