అక్షరటుడే, కోటగిరి: Mla Pocharam | ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడుచుకోవాలని, అప్పుడే భగవంతుడు కరుణిస్తాడని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు (Government Agricultural Advisor), బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని అడ్కస్ పల్లిలో గల లింగమయ్య ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ఆలయంలో వేదపండితులు సోమవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఎక్కడైతే నిత్యం భగవంతుడికి పూజలు జరుగుతాయో.. ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో అడుగులు వేయాలన్నారు. మనం ధర్మం వైపు నిలబడితే ఆ పరమాత్మ మనవైపు నిలబడతారన్నారు.
లింగమయ్య ఆలయాన్ని పునర్నిర్మాణానికి కృషి ఆలయ కమిటీ ఛైర్మన్ మమ్మలనేని రాజశేఖర్ను అభినందించారు. అనంరం ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భక్తులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
1 comment
[…] ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పోచారం (MLA Pocharam) హాజరయ్యారు. నియోజకవర్గంలోని అన్ని […]
Comments are closed.