BJP state leader
BJP state leader

అక్షరటుడే, గాంధారి: BJP state leader | ప్రతిఒక్కరూ దేశం, ధర్మం గురించి తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి (BJP state leader paidi yella reddy) అన్నారు. సదాశివనగర్ మండలంలోని లింగంపల్లిలో (sadhashiva nagar mandal, lingampalli) గల శ్రీకృష్ణ మందిరంలో నిర్వహిస్తున్న బాలసంస్కారం శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చిన్న వయస్సులో ఉన్న నాటి నుంచే దేశ సంస్కృతిని అలవర్చాలని సూచించారు. ఇది వారి పురోభివృద్ధి దోహదం చేస్తుందన్నారు. అంతేకాకుండా భగవద్గీత (bhagavad ita) బోధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. భగవద్గీత జీవితాన్ని నేర్పుందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా శక్తి ఇన్​ఛార్జి వేమారెడ్డి, బీజేపీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్​ఛార్జి లింగారావు తదితరులు పాల్గొన్నారు.