ePaper
More
    HomeతెలంగాణMalreddy Ranga Reddy | మంత్రి పదవి రేసులో ఉన్నా.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక...

    Malreddy Ranga Reddy | మంత్రి పదవి రేసులో ఉన్నా.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Malreddy Ranga Reddy | తాను మంత్రి పదవి (Minister Post) రేసులో ఉన్నట్లు ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

    అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్​ హైదరాబాద్ (Hyderabad)​ పరిధిలో కాంగ్రెస్​ నుంచి మల్​రెడ్డి రంగారెడ్డి మాత్రమే గెలుపొందారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్​ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ఆయన అవకాశం లభించలేదు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గడ్డం వివేక్​, అడ్లూరి లక్ష్మణ్​, వాకాటి శ్రీహరికి అవకాశం కల్పించారు. దీంతో మల్​రెడ్డి అలక బూనగా మంత్రి శ్రీధర్​బాబు, పీసీసీ అధ్యక్షుడు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు.

    Malreddy Ranga Reddy | ఆయనకు ఇస్తే ఓకే..

    హైదరాబాద్​, రంగారెడ్డి నుంచి మంత్రి పదవి ఎవరికి ఇవ్వలేదు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్​కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్​రెడ్డి రంగారెడ్డి, కంటోన్మెంట్​ ఉప ఎన్నికల్లో మంత్రి గణేశ్​ గెలిచారు. అయితే సీనియర్​ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని మల్​రెడ్డి ఆశిస్తున్నారు. ఒకవేళ తనకు ఇవ్వకపోతే మైనారిటీ కోటాలో అజారుద్దీన్‌కు (Azharuddin) ఇస్తే తనకు ఇబ్బంది లేదన్నారు. కాగా.. అజారుద్దీన్​ను ప్రభుత్వం ఇటీవల ఎమ్మెల్సీగా నామినేట్​ చేసిన విషయం తెలిసిందే.

    రాష్ట్రంలో సీఎంతో సహా మొత్తం 18 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం 15 మంది ఉన్నారు. ఇంకో మూడు పదవులు భర్తీ చేయొచ్చు. దీంతో తనకు అవకాశం వస్తుందని మల్​రెడ్డి ఆశిస్తున్నారు. మరో విడత విస్తరణలో తనకు పదవి ఇవ్వాలని, లేదంటే అజారుద్దీన్​కు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

    Malreddy Ranga Reddy | జూబ్లీహిల్స్‌ టికెట్‌ బీసీలకు ఇవ్వాలి

    జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ ఇటీవల మృతి చెందారు. దీంతో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన అజారుద్దీన్​ను కాంగ్రెస్​ గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ (MLC) చేయనుంది. దీంతో ఆ టికెట్​ను బీసీలకు ఇవ్వాలని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అయితే కాంగ్రెస్​ అధిష్టానం టికెట్​ ఎవరికి ఇస్తుందో చూడాలి. స్థానికంగా పని చేస్తున్న వారికే టికెట్​ ఇస్తామని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

    More like this

    Alay Balay | అలయ్‌ బలయ్‌కు రావాలని టీపీసీసీ చీఫ్‌కు ఆహ్వానం

    అక్షరటుడే, ఇందూరు: Alay Balay | హర్యానా మాజీ గవర్నర్, మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ (Former MP...

    ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి భయం లేకుండా.. లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీ...

    CP Sai Chaitanya | పోలీస్​ ప్రజావాణికి 11 ఫిర్యాదులు..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నగరంలోని సీపీ కార్యాలయంలో (CP Office) సోమవారం ప్రజావాణి...