HomeతెలంగాణPashamylaram Incident | తీరని వేదన.. తమ వారి కోసం సిగాచి పరిశ్రమ వద్ద బాధితుల...

Pashamylaram Incident | తీరని వేదన.. తమ వారి కోసం సిగాచి పరిశ్రమ వద్ద బాధితుల నిరీక్షణ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pashamylaram Incident | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో (Sigachi factory) పేలుడు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పొట్ట చేతపట్టుకొని పనిచేయడానికి వచ్చిన కార్మికులను బతుకులను బుగ్గిపాలు చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 40 మంది మృతి చెందగా.. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. అధికారులు సహాయక చర్యలు (rescue operations) చేపడుతున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ వద్ద దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తమ వారి కోసం పలువురు పరిశ్రమ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు.

Pashamylaram Incident | పోలీసులు కాళ్లు పట్టుకున్న ఓ తండ్రి

చేతికొచ్చిన కొడుకు పరిశ్రమలోని పనికి వెళ్లి తిరిగి రాలేదు. ఆ తండ్రి తమ కుమారుడి ఆచూకీ తెలపాలని పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. సిగాచి ఫ్యాక్టరీలో (Sigachi factory) జస్టిన్ (22) ఉద్యోగంలో చేరిన మూడు రోజులకు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జస్టిన్​ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆ తండ్రి కంపెనీ వద్ద నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. తన కుమారుడి ఆచూకీ చెప్పాలని రాందాస్​ అధికారులను వేడుకుంటున్నాడు.

Pashamylaram Incident | హెల్ప్​ డెస్క్ ఏర్పాటు

పేలుడు ఘటనలో 40 మృతి చెందారు. అయితే పేలుడు దాటికి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. దీంతో డీఎన్​ఏ పరీక్షలు (DNA tests) చేసి కుటుంబ సభ్యులకు (family members) మృతదేహాలు అప్పగించారు. మరోవైపు పలువురి ఆచూకీ లభించకపోవడంతో అధికారులు పటాన్​చెరు ఆస్పత్రి (Patancheru Hospital) వద్ద హెల్ప్​ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆచూకీ దొరకని వారి వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు రోజులు అవుతున్నా తమవారి జాడ లేక కుటుంబ సభ్యుల ఆవేదన చెందుతున్నారు. కాగా.. ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.