- Advertisement -
HomeUncategorizedJammu and Kashmir | కశ్మీర్​లో ఎన్​కౌంటర్ ​: ఇద్దరు ఉగ్రవాదుల హతం

Jammu and Kashmir | కశ్మీర్​లో ఎన్​కౌంటర్ ​: ఇద్దరు ఉగ్రవాదుల హతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Jammu and Kashmir | జమ్మూ కశ్మీర్​లోని బారాముల్లా(Baramulla)లో బుధవారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. బారాముల్లాలోని ఉరి సెక్టార్​ వద్ద భారత్​(India)లోకి అక్రమంగా చొరబడటానికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులును భద్రతా బలగాలు(Security forces) మట్టుబెట్టాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

కాగా జమ్ముకశ్మీర్​లోని పహల్ గామ్(Pahalgam)​లో టెర్రరిస్టులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పర్యాటకులపై కాల్పులు జరిపి 27 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మరుసటి రోజు మళ్లీ భారత్​లోకి చొరబడేందుకు పలువురు ఉగ్రవాదులు యత్నించడం గమనార్హం. ఈ సందర్భంగా భద్రత బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు(Terrorists) మృతి చెందారు.

- Advertisement -

కశ్మీర్​లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు(Police) అప్రమత్తం అయ్యారు. మరోవైపు పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతోంది. ఇప్పటికే అమిత్​ షా(Amith Shah) శ్రీనగర్​ చేరుకొని ఉగ్రదాడిపై ఆరా తీశారు. మరోవైపు ప్రధాని మోదీ(Prime Minister Modi) సైతం తన సౌదీ పర్యటను అర్ధంతరంగా ముగించుకొని భారత్​కు వచ్చారు. ఈ ఘటనపై మంత్రివర్గ సమావేశం పెట్టనున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News