ePaper
More
    HomeజాతీయంEncounter | జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్​ కీలక నేత మృతి

    Encounter | జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్​ కీలక నేత మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Encounter | వరుస ఎన్​కౌంటర్లతో మావోయిస్టులు(Maoists) కుదేలు అవుతున్నారు. నిత్యం ఎన్​కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోలు మృతి చెందుతున్నారు.

    తాజాగా వారికి మరో షాక్​ తగిలింది. జార్కండ్​లో శనివారం ఉదయం జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు నక్సల్స్​ మృతి చెందారు. జార్కండ్​లోని ఇచాబార్‌ అడవి(Jharkhand Ichabar forest)లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోలు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టుల్లో జార్ఖండ్ జన్ ముక్తీ పరిషత్ కీలక నేత పప్పు ఉన్నట్లు సమాచారం. పప్పు లోహరాపై రూ.10 లక్షల రివార్డు ఉంది.

    మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జార్కండ్(Jharkhand)​లో ఎన్​కౌంటర్​ చోటు చేసుకోవడం గమనార్హం. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బలగాలు నిత్యం కూంబింగ్​(Coombing) చేపడుతూ.. మావోల పని పడుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో పెద్దఎత్తున కూంబింగ్ చేపట్టి పలువురు మావోలను అంతం చేసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...