Operation Mahadev
Operation Mahadev | జమ్మూకాశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు హతం!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Mahadev | జమ్మూకశ్మీర్​లో సోమవారం ఎన్​కౌంటర్(Encounter)​ చేసుకుంది. కశ్మీర్‌లోని దారా సమీపంలోని హిర్వాన్ ​– లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆపరేషన్ మహదేవ్ ​(Operation Mahadev) పేరిట సెర్చ్​ ఆపరేషన్​ నిర్వహించాయి. ఈ క్రమంలో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు (Terrorists) మృతి చెందినట్లు సమాచారం. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

జమ్మూకశ్మీర్​లోని (Jammu and Kashmir) పహల్గామ్​లో ఏప్రిల్​ 22న ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 26 మంది అమాయాకులను టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​ చేపట్టి పాక్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అంతేగాకుండా దాడులకు పాల్పడిన పాక్​కు కూడా బుద్ధి చెప్పింది. అయితే పహల్గామ్​లో (Pahalgam) దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ మాత్రం ఇంత వరకు దొరకలేదు. తాజాగా ఎన్​కౌంటర్​ మృతి చెందిన వారు పహల్​గామ్​లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు తెలుస్తోంది.

Operation Mahadev | భారీగా బలగాల మోహరింపు

పహల్గామ్​ దాడికి పాల్పడిన నిందితులు దారా సమీపంలో ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బలగాలు ఆపరేషన్​ చేపట్టాయి. ఈ క్రమంలో భారీగా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. అనంతరం జరిగిన ఎన్​కౌంటర్​లో పహల్గామ్​ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. చనిపోయిన వారు పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు
చెందినవారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఓ వైపు పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో(Parliament Session) ఆపరేషన్​ సిందూర్​పై చర్చ జరుగుతుండగా.. పహల్గామ్​ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎన్​కౌంటర్​ చేయడం గమనార్హం. ఎన్​కౌంటర్​లో ఉగ్రవాదులు ఆసిఫ్​ ఫౌజీ, సులేమాన్​ షా, అబు తల్హా చనిపోయినట్లు తెలుస్తోంది.