HomeUncategorizedPM Modi | టూరిజంతో కశ్మీర్​లో ఉపాధి అవకాశాలు : పీఎం మోదీ

PM Modi | టూరిజంతో కశ్మీర్​లో ఉపాధి అవకాశాలు : పీఎం మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | పర్యాటక రంగంతో కశ్మీర్​లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం చీనాబ్​ రైల్వే వంతెన(Chenab Railway Bridge) ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆపరేషన్​ సిందూర్​ అనంతరం తొలిసారి కశ్మీర్​లో పర్యటించిన మోదీ పాకిస్తాన్​(Pakistan)పై విమర్శలు చేశారు. పాకిస్తాన్ మానవత్వం మరిచి.. పర్యాటకులపై దాడి చేయించిందన్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని పాకిస్తాన్ కుట్ర చేసిందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor)తో మనం ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే.. పాకిస్తాన్ సామాన్యుల ఇళ్లు, ప్రార్థన స్థలాలను టార్గెట్ చేసిందన్నారు. కాశ్మీర్ అభివృద్ధిని ఎవరు ఆపలేరని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పునరుద్ఘాటించారు.

PM Modi | ఆయనను గుర్తు చేసుకున్న మోదీ

పహల్​గామ్​​ ఉగ్రదాడిలో పర్యాటకులతో పాటు స్థానికంగా గుర్రం తోలే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. మోదీ తన ప్రసంగంలో ఆయనను గుర్తు చేశారు. గుర్రం మీద పర్యాటకులను తీసుకు వెళ్లే ఆదిల్‌ హుస్సేన్‌ ఆ రోజు ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడని మోదీ అన్నారు. అతడినీ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు. పాక్​ ఉగ్రకుట్రలకు దీటుగా బదులిస్తామని ప్రధాని(Prime Minister) పేర్కొన్నారు.

PM Modi | మన శక్తి ఏంటో చూపించాం..

కశ్మీర్​(Kashmir)లో పర్యాటక రంగాన్ని ధ్వంసం చేయడానికి పాక్​ పహల్​గామ్​ దాడికి పాల్పడిందని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఆపరేషన్​ సిందూర్​ ద్వారా జవాబు ఇచ్చామని, దాయాదీ దేశానికి మన శక్తి ఏమిటో చూపించామని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ల కల అయిన చీనాబ్​ రైల్వే వంతెనతో కశ్మీర్​లో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.