ePaper
More
    HomeజాతీయంPM Modi | టూరిజంతో కశ్మీర్​లో ఉపాధి అవకాశాలు : పీఎం మోదీ

    PM Modi | టూరిజంతో కశ్మీర్​లో ఉపాధి అవకాశాలు : పీఎం మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | పర్యాటక రంగంతో కశ్మీర్​లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం చీనాబ్​ రైల్వే వంతెన(Chenab Railway Bridge) ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆపరేషన్​ సిందూర్​ అనంతరం తొలిసారి కశ్మీర్​లో పర్యటించిన మోదీ పాకిస్తాన్​(Pakistan)పై విమర్శలు చేశారు. పాకిస్తాన్ మానవత్వం మరిచి.. పర్యాటకులపై దాడి చేయించిందన్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని పాకిస్తాన్ కుట్ర చేసిందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor)తో మనం ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే.. పాకిస్తాన్ సామాన్యుల ఇళ్లు, ప్రార్థన స్థలాలను టార్గెట్ చేసిందన్నారు. కాశ్మీర్ అభివృద్ధిని ఎవరు ఆపలేరని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పునరుద్ఘాటించారు.

    PM Modi | ఆయనను గుర్తు చేసుకున్న మోదీ

    పహల్​గామ్​​ ఉగ్రదాడిలో పర్యాటకులతో పాటు స్థానికంగా గుర్రం తోలే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. మోదీ తన ప్రసంగంలో ఆయనను గుర్తు చేశారు. గుర్రం మీద పర్యాటకులను తీసుకు వెళ్లే ఆదిల్‌ హుస్సేన్‌ ఆ రోజు ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడని మోదీ అన్నారు. అతడినీ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు. పాక్​ ఉగ్రకుట్రలకు దీటుగా బదులిస్తామని ప్రధాని(Prime Minister) పేర్కొన్నారు.

    PM Modi | మన శక్తి ఏంటో చూపించాం..

    కశ్మీర్​(Kashmir)లో పర్యాటక రంగాన్ని ధ్వంసం చేయడానికి పాక్​ పహల్​గామ్​ దాడికి పాల్పడిందని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఆపరేషన్​ సిందూర్​ ద్వారా జవాబు ఇచ్చామని, దాయాదీ దేశానికి మన శక్తి ఏమిటో చూపించామని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ల కల అయిన చీనాబ్​ రైల్వే వంతెనతో కశ్మీర్​లో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...