ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy Mla | ఐటీ కంపెనీలతో యువతకు ఉపాధి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

    Yellareddy Mla | ఐటీ కంపెనీలతో యువతకు ఉపాధి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Mla | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. ఐటీ కంపెనీల ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో రూ.2.40 కోట్ల నిధులతో మిషన్ భగీరథ బల్క్ నీటి కనెక్షన్ నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సకల సదుపాయాలతో టీజీఐఐసీని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గానికి ఇప్పటికే ఒక కంపెనీని తీసుకొచ్చానని, అది కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతుందన్నారు. మరిన్ని కంపెనీలతో కూడా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఈ కంపెనీలు రావడం వల్ల నియోజకవర్గంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఎన్నో సార్లు జాబ్ మేళాలు పెట్టి యువతకు ఉపాధి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

    READ ALSO  Kamareddy | లిఫ్ట్ అడిగి డబ్బులు లాక్కెళ్లిన గ్యాంగ్ అరెస్ట్

    ప్రభుత్వంతో చర్చించి కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు రూ.23 కోట్ల నిధులను విడుదల చేయించానని తెలిపారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ నిర్మాణ పనుల్లో భాగంగా భూంపల్లి, మోతే, కాటేవాడి జలశయాల నిర్మాణాలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లతో మాట్లాడి పెండింగ్​లో ఉన్న నిధులు క్లియరెన్స్​ చేయించామన్నారు. ఆర్థిక శాఖ నుంచి ఫైనల్ అప్రూవల్ వస్తే జలాశయాల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వంతో మాట్లాడతానని, రైతుల వివరాలు నివేదిక తయారు చేసి వారం రోజుల్లో అందించాలని తహశీల్దార్​కు సూచించారు.

    Latest articles

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    More like this

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...