అక్షరటుడే, వెబ్డెస్క్: Shashi Tharoor | కొంతకాలంగా సొంత పార్టీపై వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శశిథరూర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత చరిత్రలో అత్యవసర పరిస్థితిని కేవలం ఒక చీకటి అధ్యాయంగా గుర్తుంచుకోకూడదని, దాని పాఠాలను పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిపై ఆయన రాసిన వ్యాసం గురువారం మలయాళ దినపత్రిక దీపిక(Malayalam Daily Deepika)లో ప్రచురితమైంది. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ(Emergency)ని విమర్శిస్తూ శశిథరూర్ మళయాల పత్రికకు రాసిన వ్యాసం ఇప్పుడు కాంగ్రెస్తో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Shashi Tharoor | సంజయ్ క్రూరమైన చర్యలు..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అయిన శశిథరూర్(Shashi Tharoor).. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 మధ్య ప్రధానమంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi) ప్రకటించిన అత్యవసర పరిస్థితి చీకటి యుగాన్ని ఆయన తన వ్యాసంలో ప్రస్తావించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తన వ్యాసంలో కీలక విషయాలు పేర్కొన్నారు. క్రమశిక్షణ క్రమం కోసం చేపట్టిన ప్రయత్నాలు తరచుగా సమర్థించలేని క్రూరమైన చర్యలుగా మారాయన్నారు.
“ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ బలవంతంగా స్టెరిలైజేషన్ (Sterilization) ప్రచారాలకు నాయకత్వం వహించాడు. దీనివల్ల ఎమర్జెన్సీ అపఖ్యాతి పాలైంది. పేద గ్రామీణ ప్రాంతాల్లో ఏకపక్ష లక్ష్యాలను చేరుకోవడానికి హింసకు పాల్పడడం, బలవంతపు చర్యలకు పాల్పడ్డారు. న్యూఢిల్లీ (New Delhi) వంటి నగరాల్లో, మురికివాడలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి తొలగించారు. వేలాది మందిని నిరాశ్రయులను చేశారు. వారి సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోలేదు” అని థరూర్ ఆక్షేపించారు.
Shashi Tharoor | ఇది అప్పటి భారతం కాదు..
ప్రజాస్వామ్యాన్ని తేలిగ్గా తీసుకోవాల్సింది కాదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది పోయి ఇలా చేయడం సరికాదని శశిథరూర్ అన్నారు. ప్రస్తుత భారతదేశం 1975 నాటిది కాదని తెలిపారు. “మనం మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత అభివృద్ధి చెందినవాళ్లం. అనేక విధాలుగా బలమైన ప్రజాస్వామ్యం. అయినప్పటికీ, అత్యవసర పరిస్థితి పాఠాలు ఇబ్బందికరమైన మార్గాల్లో సంబంధితంగా ఉన్నాయి” అని ఆయన అన్నారు. అధికారాన్ని కేంద్రీకరించడం, అసమ్మతిని నిశ్శబ్దం చేయడం, రాజ్యాంగ రక్షణలను దాటవేయడం అనే ప్రలోభం వివిధ రూపాల్లో మళ్లీ కనిపించవచ్చని థరూర్ హెచ్చరించారు.