అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | విద్యుత్ శాఖ అధికారులు సమస్యలు తెలుసుకునేందుకు పల్లెబాట పట్టారు. ఈ సందర్భంగా డిచ్పల్లి(Dichpally) ట్రాన్స్కో డీఈ రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఇందల్వాయి మండలంలోని చంద్రాయణ్ పల్లి గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు.
విద్యుత్ సమస్యలపై రైతులు, గ్రామస్థులతో చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఉంటే వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
Indalwai | రైతులు సొంతంగా విద్యుత్ పనులు చేయవద్దు..
రైతుల సొంతంగా విద్యుత్ పనులు చేయవద్దని డీఈ సూచించారు. ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశాలున్నాయని.. ఎట్టిపరిస్థితుల్లో సొంతంగా మరమ్మతులు చేయవద్దని సూచించారు. ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1912 (Toll Free) కాల్చేసి వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజినీర్ సందీప్, ఏఎల్ఎం ప్రవీణ్, గ్రామాభివృద్ధి కమిటీ ఛైర్మన్ నర్సయ్య, గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.