71
అక్షరటుడే, ఇందూరు: GPO | జీపీవోల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో రెవెన్యూ అసోసియేషన్ అనుబంధంగా ఉన్న జీపీవో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
జీపీవో జిల్లా అధ్యక్షుడిగా బియ్య సాయినాథ్, ప్రధాన కార్యదర్శిగా గుణ్ణం సంతోష్, కోశాధికారిగా నల్ల ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా అబ్బ సుధాకర్, నీరడి రమేష్, గంగాధర్, మహిళా అధ్యక్షురాలిగా గంగాభవాని, కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొత్త పాలకవర్గాన్ని రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి తదితరులు అభినందించారు.