HomeUncategorizedSupreme Court | ఈడీ గీత దాటుతోంది.. ద‌ర్యాప్తు సంస్థ‌పై సుప్రీం అస‌హ‌నం

Supreme Court | ఈడీ గీత దాటుతోంది.. ద‌ర్యాప్తు సంస్థ‌పై సుప్రీం అస‌హ‌నం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Supreme Court | ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) పై సుప్రీంకోర్టు(Supreme Court) గురువారం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈడీ అన్ని హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని, తన అధికార ప‌రిధిని అతిక్ర‌మిస్తోంద‌ని వ్యాఖ్యానించింది.

తమిళనాడు ప్రభుత్వ మద్యం రిటైలర్ TASMACపై దాడి చేయ‌డాన్ని అత్యున్న‌త న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది. సంబంధిత సంస్థ‌పై ఈడీ చ‌ర్య‌ల‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. TASMACపై దాడి ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించింది. క‌నీస న్యాయ సూత్రాల‌ను ఈడీ ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, TASMAC దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసి, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ED తన దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించిన మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంలో సవాలు చేసింది. ప్రభుత్వ మద్యం రిటైలర్ TASMACపై ED దాడులకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

Supreme Court | దాడుల‌ను స‌మ‌ర్థించిన హైకోర్టు..

మార్చి 6, 8 తేదీల్లో మద్యం రిటైలర్ ప్రాంగణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) దాడులను సవాలు చేస్తూ TASMAC, తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు(Madras High Court)ను ఆశ్రయించాయి. అయితే, వాటికి అక్క‌డ చుక్కెదురైంది. దాడుల‌ను స‌మ‌ర్థించిన న్యాయ‌స్థానం.. మనీలాండరింగ్ “దేశ ప్రజలకు వ్యతిరేకంగా నేరం” అని పేర్కొంటూ పిటిషన్లను తోసిపుచ్చింది. దేశంలోని లక్షలాది మంది ప్రజల హక్కులతో” పోల్చినప్పుడు, దాని అధికారులను వేధించారనే ఆరోపణలపై రాష్ట్రం వాదన అసమానమైనది అని కోర్టు పేర్కొంది. దేశ ప్రయోజనాల కోసం ఈడీ దాడుల‌ను సమర్థిస్తున్న‌ట్లు తెలిపిన కోర్టు.. రాజకీయ ప్రతీకార ఆరోపణల‌ను తిరస్కరించింది. రాజకీయ క్రీడ‌లో కోర్టు భాగ‌స్వామ్యం కాద‌ని పేర్కొంది.

Must Read
Related News