అక్షరటుడే, వెబ్డెస్క్ : EAPCET Results | ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను కాకినాడ జేఎన్టీయూ (Kakinada JNTU)లో వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది, అగ్రి, ఫార్మసీ విభాగంలో 67,767 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇంజనీరింగ్ అనిరుధ్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. భాను రెడ్డి రెండో ర్యాంకు, యస్వంత్ సాధ్విక్ మూడో ర్యాంక్ సాధించారు.
