ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​EAPCET | ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

    EAPCET | ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : EAPCET | తెలంగాణ ఈఏపీసెట్​ EAPCET ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్​, ఫార్మసీ ఎంట్రెన్స్​ కోసం ఏప్రిల్​ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్​ ప్రవేశాల కోసం మే 2 నుంచి 4 వరకు ఆరు సెషన్లలో ఎగ్జామ్​ పెట్టారు. ఈ పరీక్షలు సీబీటీ CBT (ఆన్​లైన్​) విధానంలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,88,388 విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ క్రమంలో ఫలితాలు విడుదల చేసిన సీఎం విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కులు జాబితాను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థుల సెల్​ఫోన్లకు నేరుగా ఫలితాలు పంపించారు. ఇంజినీరింగ్​ విభాగంలో 73.29శాతం ఉత్తీర్ణత సాధించారు.

    EAPCET | టాప్​ ర్యాంకర్లు వీరే..

    ఇంజినీరింగ్ విభాగంలో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీ పురానికి చెందిన పల్లా భరత్ చంద్ర ఫస్ట్​ర్యాంక్​ సాధించాడు. రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లికి చెందిన ఉడగండ్ల రామ్​చరణ్ రెడ్డి రెండో స్థానంలో నిలిచాడు. ఏపీలోని విజయనగరం జిల్లా పమ్మిన హేమ సాయి సూర్య కార్తిక్ మూడో ర్యాంక్​ సాధించాడు. అగ్రికల్చర్ విభాగంలో మేడ్చల్​కు చెందిన సాకేత్ రెడ్డి ఫస్ట్​ ర్యాంక్​, కరీంనగర్​కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్యా సెకండ్​ ర్యాంక్, వరంగల్​కు చెందిన చంద్ర అక్షిత్ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు.

    More like this

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...