ePaper
More
    HomeతెలంగాణEagle Team | డ్రగ్స్ కేసులో ఈగల్​ టీమ్​ దూకుడు.. తొమ్మిది పబ్​లపై కేసు

    Eagle Team | డ్రగ్స్ కేసులో ఈగల్​ టీమ్​ దూకుడు.. తొమ్మిది పబ్​లపై కేసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | రాష్ట్రంలో డ్రగ్స్​ లేకుండా చేస్తామని ఇటీవల రేవంత్​రెడ్డి(Revanth Reddy) పేర్కొన్న విషయం తెలిసిందే. డ్రగ్స్​ రహిత తెలంగాణ(Drugs-free Telangana) కోసం కొత్తగా ఈగల్​ టీం ఆయన ఏర్పాటు చేశారు. ఎక్కడ డ్రగ్స్​, గంజాయి కనిపించినా.. ఈగల్​ టీం వాలిపోతుందని ఆయన తెలిపారు. డ్రగ్స్​తో తెలంగాణ యువత(Telangana Youth) భవిష్యత్​ నాశనం అవుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్​ టీం(Eagle Team) హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​ ముఠాల ఆట కట్టిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని కొంపల్లి మల్నాడు రెస్టారెంట్​లో బుధవారం దాడి చేసిన విషయం తెలిసిందే.

    Eagle Team | నోటీసులు జారీ

    కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant) యజమాని సూర్య డ్రగ్స్​ దందా చేస్తున్నట్లు ఈగల్​ టీం గుర్తించింది. ఈ మేరకు దాడులు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్​ డెలివరీ తీసుకుంటున్న సూర్య పలువురు ప్రముఖులకు వాటిని సరఫరా చేస్తున్నారు. అంతేగాకుండా పలు ప్రముఖ పబ్​లకు కూడా డ్రగ్స్​ అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఈగల్​ టీం సూర్య నుంచి డ్రగ్స్​ తీసుకుంటున్న తొమ్మిది పబ్​లకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

    Eagle Team | డ్రగ్స్​ పార్టీల ఏర్పాటు

    డ్రగ్స్​ దందాలో మల్నాడు ఓనర్​ సూర్య(Malnadu Owner Surya) కీలకంగా వ్యవహరించాడు. పలువురు ప్రముఖులకు, పబ్​లకు డ్రగ్స్​ సరఫరా చేయడంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో డ్రగ్స్​ పార్టీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. నగర శివారులోని రిసార్ట్​ల్లో, పబ్​లలో సూర్య డ్రగ్స్​ పార్టీలు(Drug Parties) అరెంజ్​ చేసేవాడని ఈగల్​ టీం గుర్తించింది. సూర్య నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్​ 20 సార్లు డ్రగ్స్​ కొనుగోలు చేశారు.

    Eagle Team | మూడు పబ్​లతో కలిసి..

    సూర్యకు మరో ముగ్గురు పబ్​ యజమానులతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా నిర్దారించారు. డ్రగ్స్ పార్టీ కోసం ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్స్ కు చెందిన యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈగల్​ టీం క్వాక్ పబ్ ఓనర్​ రాజా శేఖర, కోరా పబ్ యజమాని పృథ్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ముగ్గురితో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఈగల్​ టీం దర్యాప్తు వేగవంతం చేసింది.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...