Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

Bodhan | భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

అక్షరటుడే, బోధన్ ​: Bodhan | నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్​ పట్టణంలో సార్వజనిక్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిమజ్జన శోభాయాత్ర జరిగింది. సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో(Sub-Collector Vikas Mahato) యాత్రను ప్రారంభించారు.

Bodhan | నృత్యాలతో సందడి..

యాత్రలో భాగంగా మహిళలు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారి ముందు నడిచారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ఆసాంతం పోలీసులు నిఘా నీడలో కొనసాగింది. ఏసీపీ శ్రీనివాస్ ​(ACP Srinivas), సీఐ వెంకట్​ నారాయణ (CI Venkat Narayana), వంద మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు శోభాయాత్రను పోలీసులు పర్యవేక్షించారు.