Homeజిల్లాలుకామారెడ్డిMla Pocharam | అన్నిపథకాల్లో మహిళలకు సముచిత న్యాయం: ఎమ్మెల్యే పోచారం

Mla Pocharam | అన్నిపథకాల్లో మహిళలకు సముచిత న్యాయం: ఎమ్మెల్యే పోచారం

అన్ని పథకాల్లోనూ మహిళలకు సముచిత న్యాయం లభిస్తుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో మహిళా మండలి భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాల్లోనూ మహిళలకు సముచిత న్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. పట్టణంలో రూ.19 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో (SDF Funds) నూతనంగా నిర్మించిన మహిళా మండలి భవనాన్నిఆగ్రో ఇండస్ట్రీస్ (Agros Industries)​ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో కలిసి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళా సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త భవనం మహిళా సంక్షేమ కార్యక్రమాలు, స్నేహ సమూహ సమావేశాలు, సామూహిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ వస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో వేగవంతమైన పురోగతి సాధించామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎర్వల కృష్ణారెడ్డి, రవీందర్, ఖలేక్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.