అక్షరటుడే, ఇందూరు : Duddolla Giribabu Campaign | నగరంలోని 47వ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని.. తనను ఆదరించి గెలిపించాలని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి (BJP Corporator Candidate) దుద్దోళ్ల గిరిబాబు తెలిపారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.
Duddolla Giribabu Campaign | మద్దతిస్తే అండగా నిలబడతా..
డివిజన్లో తనకు మద్దతిచ్చి గెలిపిస్తే ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని దుద్దోళ్ల గిరిబాబు అన్నారు. ఈ మేరకు ప్రజలతో మమేకమై ముందుకు కదిలారు. తనను నమ్మి గెలిపించాలని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్లు ప్రజల మధ్యే ఉంటామని వారు హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కుటుం సభ్యుడిగా ఉండి సేవ చేస్తా..
తనను కుటుంబ సభ్యుడిగా భావించి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు. బీజేపీతోనే (BJP) అభివృద్ధి సాధ్యమని ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో చేసిన అభివృద్ధిని చూపిస్తూ వారు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు (BJP Leaders) , కార్యకర్తలు పాల్గొన్నారు.